నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో కాలంగా మా కుటుంబానికి మిత్రులు అని బిజెపి ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రహస్యంగా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేసారు. లాక్ డౌన్ తర్వాత తాను ఎక్కువగా తన వ్యాపారాలకు సంబంధించిన కార్యక్రమాలను పార్క్ హయత్ లో నిర్వహిస్తున్నాను అని ఆయన స్పష్టం చేసారు. 

 

ఎందరో వచ్చి తనను కలుస్తూ ఉంటారని దీని వెనుక కుట్ర లేదని, కొందరు అనవసరంగా ఆవేశ పడి వీడియో లు బయట పెడుతున్నారని సుజనా ఆరోపించారు. దున్నపోతు ఈనింది అంటే దున్నపోతుని కట్టేయమనే విధంగా వైసీపీ నేతలు మాట్లాడారు అని ఆయన మండిపడ్డారు. కామినేని శ్రీనివాస్ తో ఏపీ పార్టీ వ్యవహారాలను తాను మాట్లాడా అని ఆయన పేర్కొన్నారు. నిమ్మగడ్డ తనను కలవాలి అని అన్నారు అని అందుకే కలిసా అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: