ఏపీఎస్ ఆర్టీసి, టిఎస్ఆర్టీసి అధికారుల మధ్య రేపు జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. రేపు ఈ భేటి హైదరాబాద్ లో జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా వేసారు అధికారులు. ఈ భేటీ లో అంతరాష్ట్ర బస్సు రవాణా సర్వీసులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాని వాయిదా పడింది. 

 

గత వారం విజయవాడలో రెండు రాష్ట్రాల అధికారులు కూడా భేటి అయ్యారు. అయితే హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ అనంతపురం బస్సు సర్వీసులపై స్పష్టత రావడం లేదు. అంతరాష్ట్ర రవాణా మొదలైతే కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ భేటి ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద ఇంకా స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: