కరోనా పేరు చెప్తే ఇప్పుడు ప్రజలే కాదు ప్రజా ప్రతినిధులు కూడా భయపడిపోతున్నారు. ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, సహా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బిజెపి ఎమ్మెల్యే ఒకరు అస్సాం లో కరోనా బారిన పడ్డారు. 

 

అసోం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లాలోని పథర్ కండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణేందు పాల్ కు కరోనా లక్షణాలు కనపడటం తో అతనికి కరోనా పరిక్షలు నిర్వహించారు. అతని లాలా జాలం సేకరించి కరోనా పరిక్షలు చేయగా ఆయనకు కరోనా ఉందని వెల్లడి అయింది. దీనితో ఆయనతో సంబంధం ఉన్న అందరిని క్వారంటైన్ చేసారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: