తెలంగాణాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశం మాత్రం కనపడటం లేదు. నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. నల్గొండ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పరిస్థితి ఇప్పుడు చాలా భయంకరంగా ఉందని లెక్కలు చెప్తున్నాయి. 

 

ఇక హైదరాబాద్ ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు కూడా హైదరాబాద్ వద్దు అనే భావనలో ఉన్నారని తెలుస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రయాణాలను రద్దు చేసుకునే పరిస్థితి ఉంది. నిన్న మొన్న కలిపి హైదరాబాద్ లో 1300 కేసులు వచ్చాయి అంటే తీవ్రత ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: