ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయం పట్టుకుంది. దాదాపు కోటికి చేరుకున్న కేసులు.. మరణాలు ఐదు లక్షల వరకు చేరుకున్నాయి. ఇది చాలదన్నట్లు ఇప్పుడు తుఫాన్లు, భూకంపాలతో ప్రజలు వణికి పోతున్నారు.  తాజాగా మెక్సికోలో నిన్న 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:29 గంటలకు సంభవించిన ఈ భూకంపానికి ప్రజలు వణికిపోయారు.  భూకంప తీవ్రతతో భయంతో ప్రజలు వణికిపోయారు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో పలు భవనాలు కంపించాయి. భూ ప్రకంపనలతో అప్రమత్తమైన అధికారులు ఆసుపత్రుల నుంచి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

మెక్సికోతోపాటు మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.  కాగా, మెక్సిలో మూడేళ్ల క్రితం సంభవించిన భారీ భూకంపంలో 355 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని, ఆక్సాకా స్టేట్ పసిఫిక్ తీరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా నలుగురు మరణించినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: