సామాజిక కార్యకర్త లగడపాటి హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఖమ్మంలో ప్రముఖ సామాజిక కార్యకర్త లగడపాటి హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. కవిరాజ్​నగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

 

వైబ్రేంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ మహిళా అధ్యక్షురాలిగా లాక్​డౌన్‌ సమయంలో నగరంలోని ఎంతో మంది పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈమె మృతి పట్ల అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎవరి బెదిరింపు లు వలన ఈ ఆత్మహత్య చోటు చేసుకుందా అనే విధంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: