వైఎస్సార్ కాపు నేస్తం కార్యక్రమానికి ఏపీ సిఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు 4700 కోట్లను వివిధ పథకాల ద్వారా అందించామని చెప్పారు. కాపు మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. 

 

సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన ఎజెండా గా తాము ముందుకు నడుస్తున్నామని సిఎం అన్నారు. ప్రతీ ఒక్కరికి కూడా తాము సంక్షేమ ఫలాలు అందిస్తామని అర్హులు అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అని అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ప్రతీ పథకం అందే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: