అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పిన సీఎం జగన్.. ల్యాండ్ విషయంలో జరిగిన అవినీతిని ఎందుకు సమర్ధించారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిలదీశారు. ఆవ భూములపై విచారణ జరిపించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేసారు. 

 

రూ. 45 లక్షలు పెట్టి కొనుగోలు చేశారన్న ఆయన... అంత ధర ఉండదని ఆయన పేర్కొన్నారు. తాను రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అదే ధరకు ఎక్కడ భూములు ఇచ్చినా కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించారని పేర్కొన్నారు. అయితే అన్ని నిబంధనల ప్రకారమే జరిగిందన్న ఆయన... మూడు శాతం మాత్రమే ఎక్కువ పెంచడం జరిగిందని ఆర్థికశాఖ మంత్రి చెప్పినట్టు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: