టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు, టీడీపీ నేత నలంద కిషోర్‌ను జిల్లా సీఐడీ కార్యాలయానికి అధికారులు తరలించి విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసారు అనే అభియోగం తో ఆయనపై ఫిర్యాదు నమోదు చేసారు. ఇదే కేసులో మరో నిందితుడైన కర్నూల్‌కు చెందిన షేక్ మోతిలాల్‌ను ఈ నెల 21న సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 

 

విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి గంటా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన మీద రాజకీయ కక్ష ఉంటే తన మీద తీర్చుకోవాలి గాని ఈ విధంగా తన వారిని వేధించడం సరికాదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: