ఎంతో ప్రశాంతంగా ఉండే అరకు వ్యాలీ లో కూడా ఇప్పుడు కోరనా కేసులు పెరుగుతున్నాయి. అక్కడ కరోనా  లేదు అని భావించినా సరే రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపధ్యంలోనే కరోనా కట్టడిలో భాగంగా అక్కడ స్వచ్చందంగా లాక్ డౌన్ ని ప్రకటించాలి అని  నిర్ణయం తీసుకున్నారు. అరకు వ్యాలీలో రేపటి నుంచి లాక్ డౌన్ ని అమలు చేస్తారు. 

 

ఏజెన్సీలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పౌర సంక్షేమ సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకోగా ఈస్వచ్ఛంద లాక్‌డౌన్‌కు వర్తక సంఘం మద్దతు ప్రకటించడం విశేషం. ప్రతి శుక్రవారం జరిగే అరకు వారపు సంతను కరోనా కారణంగా అధికారులు రద్దు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: