వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయిరెడ్డి పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత కొన్ని రోజుల నుంచి పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలకు గాను షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

 


 పార్టీ ఎమ్మెల్యేలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పై పార్టీ అధినాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే షోకాజ్  నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని షోకాజ్ నోటీసుల్లో  వైసిపి ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: