ప్రముఖ సినీ నిర్మాత, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 భూవివాదం విషయమై పీవీపీ మనుషులు తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పీవీపీ తన ఇంటి ఎలివేషన్ దెబ్బ తింటుందనే కారణంతో ఇంటి నిర్మాణం ఆపాలని హెచ్చరించాడని విక్రమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. 
 
అయితే పీవీపీ కైలాస్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వివాదానికి సంబంధించిన భూమి కాగితాలు తన దగ్గర ఉన్నాయని ఆయన చెబుతున్నారు. బంజారాహిల్స్ లోని భూమిలో చేపట్టిన నిర్మాణం విషయంలో పీవీపీ, కైలాస్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: