కడప జిల్లా ఎర్రగుంట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణను హత్యోదంతం జిల్లాలో కలకలం రేపుతోంది. ఆర్థిక లావాదేవీలతో ఈ హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటరమణ మృతదేహం మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్య ఇంట్లోని సంపులో పోలీసులు గుర్తించారు. పోలీసులు ముసలయ్యను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లో మొండెం గుర్తించిన పోలీసులు తలను కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ లో టిఫిన్ బాక్స్ లో గుర్తించారు. జూన్ 22వ తేదీ నుంచి వెంకటరమణ కనిపించకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. వెంకటరమణ ముసలయ్యకు 50 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఈ లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: