టీడీపీ ఎంపీ కేసినేని నానీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసలుఎన్నికల కమీషనర్ గా ఉన్నారా లేదా అని ఆయన నిలదీశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యాలని... కనగరాజ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిస్తే తప్పులేదు కానీ, రమేష్ కుమార్ సుజనాచౌదరిని, కామినేని శ్రీనివాస్ ను కలిస్తే తప్పా అని ఆయన నిలదీశారు. 

 

వైసీపీ వారికి ఒక నీతి, ఇతరులకు ఒక నీతా అని ఆయన నిలదీశారు. సుజనాచౌదరి తన కార్యాలయాన్ని జూబ్లీహిల్స్ నుంచి హయ్యత్ హోటల్ కు మార్చుకున్నారన్న ఆయన... హయ్యత్ హోటల్ పబ్లిక్ ప్లేసే కానీ, ప్రైవేట్ ప్లేస్ కాదని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజాస్వామ్యబద్ద పోస్టులో ఉన్నారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారన్న ఆయన... మరోవైపు ఆయనను ఎస్ఈసీ నుంచి తొలగించామని కూడా చెబుతున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: