ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. పరీక్షలు ఎలా నిర్వహించాలనే అంశంపై ఇప్పటివరకు ప్రయత్నాలు చేశామన్న ఆయన... సాధ్యాసాధ్యాలపై అన్ని యూనివర్సిటీల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నామని వివరించారు. 

 

అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన వివరించారు. సిఎం జగన్ తో చర్చించిన తరువాత ఆయన ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయటంపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన వివరించారు. అయితే డిగ్రీ పరీక్షలను రద్దు చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం నుంచి ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: