ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎంపీ సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలవడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. దీనిపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల మధ్య సమావేశం జరిగినట్లు వార్త బయటకు వచ్చిందన్న ఆయన...  దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. 

 

ఈ అంశంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలు వస్తున్నాయని మధు పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడిందన్న ఆయన... దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలని, ఎన్నికల కమిషనర్ విషయం వివాదంగా మారి కోర్టుకెక్కిన నేపథ్యంలో రమేష్ కుమార్ బీజేపీ నాయకులను ప్రత్యేకంగా కలవడం అనేక అనుమానాలకు, అపోహలకు ఆస్కారం కలిగిస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: