గాంధీ ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం తగదు అని మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. ఆరోగ్య రంగంలో కేరళ రాష్ట్రంతో పోటీ పడుతున్నామని అన్నారు. ప్రభుత్వ వైద్యం పై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. కరోనా రోగులకు గాంధీ ఆస్పత్రిలో చాలా బాగా వైద్యం చేస్తున్నారని అన్నారు. కరోనా రోగులకు చికిత్స చెయ్యాలి అంటే సాహసం కావాలని ఆయన పేర్కొన్నారు. 

 

హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బ తీయడానికే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజారోగ్యం విషయంలో తాము రాజీ పడేది లేదన్నారు. వైద్యుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దు అని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం తాము వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: