ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్లి బిజెపి ఎంపీ సుజనా చౌదరి ని కలవడం వెనుక కుట్ర దాగి ఉంది అంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

 

తాజాగా ఆయన ఈ మేరకు ఒక ట్వీట్ చేసారు. “అసలు వాళ్లు ముగ్గురు గోప్యంగా కలవాల్సిన రాచకార్యాలు ఏమున్నాయని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, కుల మీడియా ఆవేదన మరోలా ఉంది. సిసి కెమెరా ఫుటేజి బయటకెలా వచ్చిందని గుండెలు బాదుకుంది. విఐపిలు, సెలబ్రటీలు వెళ్లే చోట ఇంత ఆశామాషీగా ఉంటే ఎలా అని కడివెడు నీళ్లు కార్చింది” అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: