పార్టీ క్రమ శిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారికి అయినా సరే చర్యలు తప్పవు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. పార్టీ క్రమ శిక్షణ చర్యలను ఉల్లంఘించారు కాబట్టే రఘురామా కృష్ణం రాజుకి నోటీసులు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఆయన నోటీసులకు సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. 

 

రఘుకి పార్టీలో చాలా గౌరవం ఇచ్చామని ఆయన అన్నారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని విజయసాయి ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు అని అందుకే నోటీసులు ఇచ్చామని, ఎవరికి అయినా సరే నోటీసులు ఇస్తామని ఆయన అన్నారు. తప్పు చేస్తే వదిలే సమస్యే లేదని ఆయన స్పష్టం చేసారు. కాగా నేడు రఘురామ కృష్ణం రాజుకి షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: