ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల గురించి నిన్న చర్చలు జరగాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా చర్చలు వాయిదా పడ్డాయి. టీ.ఎస్.ఆర్టీసీ విభాగంలో ఒక వ్యక్తికి కరోనా సోకడంతో అధికారులు చర్చల్ని వాయిదా వేశారు. ఆ వ్యక్తికి కరోనా సోకడంతో అధికారులు తమకు కూడా కరోనా సోకి ఉండవచ్చని అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. 
 
రోజురోజుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో చర్చలు ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి తగ్గిన తరువాత అధికారులు చర్చలు జరిపి బస్సు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ తెలంగాణ బస్సు సర్వీసుల కోసం ఎదురు చూసే వాళ్లు ఇంకొంత కాలం తమ ప్రయాణాలను వాయిదా వేసుకోక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: