గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచి ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో కుల రాజకీయాలు.... అవినీతి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో తాజాగా వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. 
 
ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని వైసీపీ హెచ్చరించింది. తాజాగా రఘురామకృష్ణంరాజు నోటీసుల గురించి స్పందించారు. బుధ‌వారం మధ్యాహ్నం 18 పేజీల నోటీసు షోకాజ్ నోటీసు వచ్చిందని... రెండు పేజీలు రిటన్ షోకాజ్ కాగా 16 పేజీలు పేపర్ క్లిపింగ్స్ ఉన్నాయని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిని తాను ఏమీ లేదని... నోటీసుకు నేడు సమాధానం చెబుతానని ఆయన అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: