అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం చేసినా అది ఒక సంచలనమే. అతను ఏం మాట్లాడినా మీడియాకు అదొక బ్రేకింగ్ న్యూస్ గా మారుతుంది. ట్రంప్ ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని ఎందుకు విమర్శిస్తారు తెలియదు గానీ ఆ విమర్శలు మాత్రం తారా స్థాయికి చేరుకుంటాయి. అయన విమర్శ చేయడానికి ఎంచుకునే వ్యక్తి కూడా అతను స్థాయి వ్యక్తి అయ్యి ఉంటారు.

 


ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు. ఒబామా అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు మత్స్య పరిశ్రమను తీవ్రస్థాయిలో నాశనం చేశారని, ఇప్పుడు తాను వచ్చి ఎవరూ ఊహించని స్థాయికి అభివృద్ధి చేశానని అని చెప్పుకుంటూ వచ్చారు. చేపల పట్టండి,ఆనందించండి, డబ్బులు సంపాదించండి  అంటూ ట్వీట్ చేశారు..


ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఎంతోమంది ఒబామా అభిమానులు ట్విట్టర్ వేదికగా డోనాల్డ్ ట్రంప్ ను ప్రశ్నల ప్రవాహంతో ముంచెత్తారు. ఏ విధంగా ఒబామా చేపల పరిశ్రమ నాశనం చేశారు అని చెప్పాలని కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: