ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పరిక్షల విషయం లో సిఎం వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో డిగ్రీ పరిక్షల విషయంలో సిఎం జగన్ తీసుకునే నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిగ్రీ పరీక్షలను రద్దు చేయడం మంచిది అనే భావన లో ఏపీ విద్యా శాఖ ఉంది. 

 

అన్ని విశ్వ విద్యాలయాలతో కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. వారు కూడా పరీక్షలను రద్దు చేయడమే మంచిది అనే అభిప్రాయం మంత్రి ముందు పెట్టారు. ఇక యుజీసీ కూడా డిగ్రీ పరిక్షలు వద్దు అనే ఆలోచనలో ఉంది అని తెలుస్తుంది. దీనిపై నేడు జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: