హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో బిజెపి ఎంపీ సుజనా చౌదరి, ఏపీ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ కలవడంపై వైసీపీ నేతలు విమర్శల తీవ్రత పెంచుతూనే ఉన్నారు. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఈ భేటీ ని ప్రభుత్వంపై కుట్రగా ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన మార్క్ పంచ్ లు వేస్తున్నారు సోషల్ మీడియాలో.
“ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా. కమ్మని విందులతో పార్క్ హయత్ సాక్షిగా ఇలా దొరికిపోతాడని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి సాహసించడు. వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు” అని ఆయన ట్వీట్ చేసారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా. కమ్మని విందులతో పార్క్ హయత్ సాక్షిగా ఇలా దొరికిపోతాడని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి సాహసించడు. వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు.
— Vijayasai reddy v (@VSReddy_MP) June 25, 2020