కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లాటలు అయిపొయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వైఎస్ జగన్... గారు పారాసెటమాల్ మాటలు చెప్పినట్టే యంత్రాంగం కరోనా టెస్టులను ఆషామాషీగా చేస్తుందా అన్న అనుమానం వస్తోందని ఆయన పేర్కొన్నారు. “ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి  గారికి కరోనా టెస్టు చేసి పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్ కు రమ్మని హడావిడి చేసారు.

 

 తీరా దీపక్ రెడ్డిగారు హైదరాబాద్ లో రెండుసార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేసుకుంటే రెండు చోట్లా నెగటివ్ అని వచ్చింది. ఒక ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే, ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారు వీళ్ళు? ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో ఏమిటీ నిర్లక్ష్యం పాజిటివ్ అని నిర్ధారణ చేసుకోకుండా తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిగారిని క్వారంటైన్ లో పెట్టడానికి చేసిన హడావిడి చూస్తే.. ఇంకేదయినా కుట్ర చేసిందా ప్రభుత్వం అని కూడా అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా కరోనా పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందే.” అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: