వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే అందరూ నిజమే అనుకున్నారని... కమ్మని విందులతో పార్క్ హయత్ సాక్షిగా నిమ్మగడ్డ దొరుకుతాడని చంద్రబాబు ఊహించలేదని అన్నారు.
జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి చంద్రబాబు సాహసించడని..... వెన్నుపోట్లతోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడని చెప్పారు. అసలు వాళ్లు ముగ్గురు గోప్యంగా కలవాల్సిన రాచకార్యాలు ఏమున్నాయని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కుల మీడియా మాత్రం సీసీ ఫుటేజీ బయటకెలా వచ్చిందని గుండెలు బాదుకుంటోందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా. కమ్మని విందులతో పార్క్ హయత్ సాక్షిగా ఇలా దొరికిపోతాడని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి సాహసించడు. వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు.
— Vijayasai reddy v (@VSReddy_MP) June 25, 2020