ముంబైలోని నారీమన్ పాయింట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడం తో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. 5 ఫైర్ ఇంజిన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఒక బ్యాంకు లో ఈ మంటలు చెలరేగాయి అని తెలుస్తుంది. 

 

ఇక ఈ  అగ్ని ప్రమాదంలో బ్యాంకు లో భారీగా ఆస్తి నష్టం జరిగింది అని అధికారులు చెప్తున్నారు. ఇక వెంటనే అక్కడి స్థానికులను కూడా ఇళ్ళను ఖాళీ చేయించి సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించింది అని తెలుస్తుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: