మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపిక కావడంతో ఇద్దరూ కూడా తమ ఎమ్మెల్సీ పదవులకు నేడు రాజీనామా చేసే అవకాశం ఉంది. మండలి చైర్మన్ షరీఫ్ కి వారు ఈ లేఖను పంపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక వారి స్థానంలో ఎవరిని మండలికి పంపిస్తారు అనేది చూడాలి.   

 

నేడు రాజీనామా చేసే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇద్దరూ మంత్రి పదవులకు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం  జరుగుతుంది. ఇక కేబినేట్ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని, కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే అని సమాచారం. కేబినేట్ విస్తరణ విషయంలో సిఎం జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. నలుగురి పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: