బహిర్భూమికని వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం పెద్ద నక్కలపేట గ్రామంలో విషాద సంఘటన జరిగింది. బహిర్భూమికని వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాత పడ్డారు.

 

 

జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన కార్తీక్​ 3 రోజుల క్రితం తన తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. తన మేనమామ కుమారుడైన సిద్ధార్థతో కలిసి బహిర్భూమికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

 

మామిడి సిద్ధార్థ, కార్తీక్​లు బుధవారం మధ్యాహ్నం బహిర్భూమికని వెళ్లారు. సమయం రాత్రి దాటుతున్నా ఇంటికి రాకపోవడం వలన కుటుంబ సభ్యులు గ్రామం మొత్తం వెతికారు. స్థానిక బోధరి గూడెం చెరువు వద్ద చెప్పులు, దుస్తులు కనిపించాయి. అనుమానంతో చెరువులో వెతకగా.. ఇద్దరూ అప్పటికే ప్రాణాలు విడిచి  కనిపించారు. ఫలితంగా కుటుంబ సభ్యుల రోదనలతో నిండిపోయింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: