తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రైవేటు యూనివర్సిటీ ప్రారంభమైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ విద్యాసంవత్సరం నుంచి ఎనిమిది కొత్త కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వర్సిటీ లోగో, బ్రోచర్‌, వెబ్‌సైట్‌ను నిన్న ఆవిష్కరించారు. 
 
మంత్రి మల్లారెడ్డి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ థింకింగ్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, డాటా సైన్స్‌ అండ్‌ డాటా అనాలిసిస్‌, మల్టీమీడియా టెక్నాలజీస్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇంజనీరింగ్ కోర్సులతో పాటు రొబోటిక్స్‌, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీలాంటి కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: