టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడుకు రెండోసారి ఆపరేషన్ జరిగిన తరువాత విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారని.... అయినా ఆయనను బలవంతంగా డిశ్చార్జ్ చేసి అదుపులోకి తీసుకోవాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఆయన ప్రాణాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుమానంగా ఉందంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 
 
బీసీ నేత అచ్చెన్నాయుడు పై ఇన్ని కుట్రలు జరుగుతుంటే వైసీపీలో ఉన్న బీసీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్ కు టీడీపీ ఒకటే చెబుతోందని... అచ్చెన్నాయుడు ప్రాణాలకు ఏ మాత్రం హాని జరిగినా జగన్ బాధ్యత వహించాలని కోరారు. లేదంటే బీసీలు మిమ్మల్ని క్షమించరంటూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: