ఈ మద్య మనుషులు ఉన్మాదులుగా మారుతున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు వెలుగు లోకి వస్తున్నాయి.  ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి ఎదుటి వారిపై దాడులు చేయడం.. చివరికి హత్యలు చేసిన ఘటనలు వెలుగు లోకి వచ్చాయి. తాజాగా భార్యతో కలిసి ఓ వ్యక్తి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే, అతడిని అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు అమ్మాయితో ఇంత రాత్రి పూట ఎక్కడికెళుతున్నావంటూ కొట్టి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. 

 

బీహార్‌కు చెందిన మిథున్‌ పాటేల్‌ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం పంజాబ్‌లోని పటియాలకు వచ్చి అక్కడి ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు.అతని భార్యతో కలిసి అర్థరాత్రి నడుచుకుంటూ వస్తున్నాడు.. అక్కడి చేరుకున్న జగ్‌మోహన్‌ సింగ్‌, భూపేందర్‌ సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు వారిని ఆపి అర్థరాత్రి పూట అమ్మాయితో తిరుగుతావా అని గొడవకు దిగారు.

 

ఆమె తన భార్య అని, తామిద్దరం కలిసి గురుద్వారాకు వెళుతున్నామని చెప్పినప్పటికీ.. ఆ దుర్మార్గులు ఏమాత్రం వినిపించుకోకుండా కనికరం లేకుండా దాడికి తెగబడ్డారు.  రాళ్లు, ఇటుకలతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: