దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు వైరస్ భారీన పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యేకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు మనవడు అన్నా గౌతమ్ కు కరోనా నిర్ధారణ అయింది. 
 
ఈ మేరకు వైద్యులు ప్రకటన చేశారు. ఎమ్మెల్యే అన్న కారు డ్రైవర్, అతని వద్ద పనిచేస్తున్న అటెండర్ కు కూడా కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో గత 24 గంటల్లో 553 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 11,000కు చేరువలో ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: