గత  కొన్ని రోజులుగా భారత్ - చైనాల మద్య పెద్ద ఎత్తు యుద్ద మేఘాలు కమ్ముకుంటున్న విషయం తెలిసిందే. చైనా సైనికుల దాడిలో 20 మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో చైనా పేరు చెబితే భారతీయులు కోపంతో రగిలిపోతున్నారు. అంతే కాదు చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తున్నారు.  చైనా వస్తువులను కొనడం ఆపేస్తే ఆ దేశానికి ఆర్థికంగా పెద్ద దెబ్బ తగులుతుందని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో, తమిళ సినీ దర్శకుడు శక్తి చిదంబరం తన ఇంట్లో ఉన్న చైనా వస్తువులను తగలబెట్టారు.

 

చైనాలో తయారైన సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టేప్ రికార్డర్లను కుప్పగా పోసి, నిప్పటించారు.  బ్యాన్ చైనా ప్రాడక్ట్స్ అంటూ ఓ క్యాంపెయిన్ ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడ్డారని, మన సైనికులను హతమార్చారని చెప్పారు. అందుకు బదులు గా ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిలా పోరాాడాలని.. అది బార్డర్ లో కాదు.. ఇక్కడే చైనా వస్తువులు బహిష్కరించాలని కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: