ప్రస్తుతం కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా లోకాన్ని కూడా సరిగా చూడని పసికందులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడి చని పోతున్నారు.
ఖమ్మం జిల్లాలో ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ముదిగొండ కు చెందిన చిన్నారికి మెదక్ కిడ్నీ గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి, సదరు చిన్నారి హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ చిన్నారి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆ చిన్నారికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.