రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో తాజాగా పార్క్ చేసిన బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వున్న ప్రజలు అందరూ భయంతో పరుగులు తీశారు. కొంతమంది స్థానికులు ధైర్యం చేసి మంటలు ఆర్పడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బైక్ ముందుభాగం కవర్లో శానిటైజర్ పెట్టడం కారణంగానే మంటలు వచ్చినట్టు వాహనదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శానిటైసర్ తో పాటు షార్ట్ సర్క్యూట్ కూడా జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శానిటైజర్ కి మండే స్వభావం ఎక్కువగా ఉండటంతో పలు చోట్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసింది.