ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం విజయనగరం జిల్లా ఎస్. కోట ఎమ్మెల్యే కరోనా భారీన పడగా తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యేకు కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గత రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. 
 
ప్రస్తుతం ఎమ్మెల్యే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 1500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయనను ఇటీవల కలిసిన అధికారులు భయాందోళనకు గురవుతున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: