తండ్రి చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ.3.2 లక్షల నగదు, మూడు తులాల బంగారం, రెండు కడియాలు దొంగతనం అయినట్లు బాధితుడు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పట్టణానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి ఆదివారం తండ్రి అంత్యక్రియలకు గట్టు మండలం మల్లంపల్లికి వెళ్లారు. 

 


తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువాతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు జిల్లా నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​తో సోదాలు నిర్వహించారు. రూ.3.2 లక్షల నగదు, మూడు తులాల బంగారం, రెండు కడియాలు దొంగతనం అయినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

రోజూ రోజు కి ఇలాంటి దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు నిఘా ఎంత పెట్టిన , రాత్రి సమయంలో సీసీ కెమెరాలు పర్యవేక్షణ చేసిన కొన్ని సార్లు పట్ట పగలు దొంగతనం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: