తిరుపతి నగరంలో సంచలనం రేపిన యువకుడు విజయ్ హత్య కేసులో పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయ్ స్నేహితుడే ఈ హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చారు. నిందితుల నుంచి కత్తి, స్క్రూ డ్రైవర్లు, 4 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది యువకులు కలిసి అతన్ని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి తూర్పు సీఐ శివప్రసాద్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన విజయ్, సన్నీ స్నేహితులు.
అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య డబ్బులు, సెల్ఫోన్లు, బైకుల వ్యవహారంలో విభేదాలు వచ్చాయి. ఈనెల 16న విజయ్ మరో స్నేహితుడి ఇంటి వద్ద పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్తుండగా దారిలో లోకేశ్ అనే యువకుడు సన్నీని కొట్టాడు. ఈ ఘటనలో విజయ్ లోకేశ్ను సమర్థించాడు. ఈక్రమంలో పగ పెంచుకున్న సన్నీ.. విజయ్ను చంపాలని నిర్ణయించుకున్నాడు.ఈనెల 18న విజయ్కు ఫోన్ చేసిన సన్నీ.. తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలకు రావాలని పిలిచాడు. అనంతరం బైక్ మీద ఎక్కించుకుని గోవిందరాజస్వామి సత్రాల వద్దకు విజయ్ను తీసుకొచ్చారు.
విజయ్ పై కత్తి, స్క్రూ డ్రైవర్లతో దాడిచేసి.. హత్య చేశారు.ఈ కేసులో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకర్ని మైనర్గా గుర్తించారు. 4 బైక్లు, కత్తి, స్కూడ్రైవర్లు స్వాధీనం చేసుకున్నారు.