దేశంలో వరుసగా ఈ  రోజూ పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ లో  లీటర్​ పెట్రోల్​ ధర 21 పైసలు పెరిగి రికార్డు స్థాయికి చేరింది. డీజిల్​ ధర లీటర్​పై  17 పైసలు పెరిగి ఢిల్లీలో రూ.80 మార్క్​ను దాటింది.

 

 

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కళ్లెం పడే సూచనలు కనిపించడంలేదు. వరుసగా ఈ రోజు కూడా చమురు ధరలు భగ్గుమన్నాయి.  డీజిల్‌పై 17 పైసలు, పెట్రోలుపై 21 పైసలు పెంచినట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.80.19కు చేరగా.. పెట్రోల్‌ ధర రూ.80.13 కు చేరింది.

 


దేశంలోని ఇతర రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, వ్యాట్‌లలో వ్యత్యాసం వల్ల.... పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఢిల్లీ లో కన్నా ఎక్కువగానో లేదా తక్కువగానో ఉంటున్నాయి. తాజా సవరణతో ఇతర నగరాల కన్నా ఢిల్లీలో డీజిల్‌ ధర అధికం కాగా పెట్రోల్‌ ధర మాత్రం తక్కువగా ఉంది.

 

https://twitter.com/ANI/status/1276314906736734208?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: