ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో ఏపీ సర్కార్ ముందు చూపుతో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఏపీ సర్కార్ మాత్రం ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ సర్కార్ ని వెలిగొండ టన్నెల్ విషయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మెచ్చుకున్నారు. సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసి సిఎం ని అభినందించారు. 

 

వెలిగొండ టన్నెల్ పూర్తి చేసి ఈ ఏడాది నీళ్లు ఇస్తామనడం శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షలు, ఇంటికో ఉద్యోగం, స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన సూచించారు. ముంపు గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు ఆగిపోయాయన్న ఆయన... ముంపు గ్రామాల్లో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: