దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్న నేపధ్యంలో ఇప్పుడు మరోసారి కేంద్రం తన బృందాలను రాష్ట్రాలకు పంపిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు... మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ లో ఈ బృందాలు పర్యటనలు చేసి పరిస్థితిని అంచనా వేసి కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

ముఖ్యంగా మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణాపై కేంద్ర బృందాలు ప్రత్యేక దృష్టి పెట్టి సీనియర్ వైద్యులతో పాటుగా ఆయా రాష్ట్రాల ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ముందు ముంబై వెళ్లి అక్కడి సిఎం ఉద్దావ్ థాకరే తో సమావేశం అయ్యే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక వచ్చే నెల మొదటి వారం లో హైదరాబాద్ రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: