ఇప్పుడు మాస్క్ లు అనేవి చాలా అవసరం. అసలు మాస్క్ లేనిదే బయటకు వెళ్ళే ప్రయత్నం చేయవద్దు అని అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇక మాస్క్ ల కోసం ఇప్పుడు జనాలు బారులు తీరుతున్నారు. దేశ వ్యాప్తంగా కూడా మాస్క్ ల కొరత అనేది క్రమంగా పెరుగుతుంది కూడా. ఈ తరుణంలో మాస్క్ లను ఎవరికి వారుగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. 

 

తాజాగా కర్ణాటక కు చెందిన ఒక బాలిక  ఒక చేయి లేకపోయినా సరే మాస్క్ లు కుట్టి అందిస్తుంది. కర్ణాటకలోని ఉడుపికి చెందిన సింధూరి అనే పదేళ్ల బాలిక ఫేస్ మాస్క్‌లు కుట్టి, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (ఎస్‌ఎస్‌ఎల్‌సి) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నిన్న పంపిణీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: