భారత్ లో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతూనే ఉంది గాని తగ్గడం లేదు. ప్రతీ రోజు కూడా వేల కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా 17 వేలు దాటాయి కరోనా కేసులు. గత 24 గంటల్లో భారతదేశంలో 407 మరణాలు నమోదు అయ్యాయి దేశంలో.
అత్యధికగా 17,296 కొత్త కేసులు వచ్చాయి. నిన్న దాదాపు 17 వేలు నమోదు కాగా నేడు ఆ సంఖ్య దాటింది. భారతదేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యా చూస్తే 4,90,401గా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. వీటిలో 1,89,463 క్రియాశీల కేసులు ఉన్నాయి అని వివరించింది. 2,85,637 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. 15301 మంది కరోనాతో మరణించారు అని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.