హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని ఏ మాత్రం మార్పు రావడం లేదు. కరోనా టెస్ట్ లను కూడా ఎక్కువగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక హైదరాబాద్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది అనే చెప్పాలి. అక్కడి వ్యాపారులు కూడా కరోనా దెబ్బకు భయపడుతున్నారు. వ్యాపారాలను కూడా తీసే పరిస్థితి లేదు. 

 

ఇక తాజాగా హైదరాబాద్ లో వ్యాపారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా జూన్ 28 నుండి 1 వారాల లాక్డౌన్ అమలు చేయడానికి హైదరాబాద్ లోని బేగం బజార్ మార్కెట్ లో వ్యాపారులు సిద్దమయ్యారు. "మా దుకాణదారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలను కరోనా వైరస్ నుండి కాపాడటానికి మేము స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నాము" అని హైదరాబాద్ కిరానా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ఎన్ రతి మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: