ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా పరిక్షలు కూడా వేగంగా జరుగుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏపీలో కరోనా పరిక్షలు జరుగుతున్నాయి. రోజు రోజుకి కరోనా పరిక్షల సంఖ్యను ఏపీ సర్కార్ పెంచే ప్రయత్నం చేస్తుంది. ప్రతీ రోజు 20 వేలకు పైగా కరోనా పరిక్షలు జరుగుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే... కరోనా పరిక్షలు ఏర్పాట్లపై వైసీపీ ఎంపీ విజయసాయి ట్వీట్ చేసారు. “కోవిడ్ నియంత్రణ, చికిత్సలో సిఎం జగన్ గారి కార్యదీక్ష, ముందు చూపును ప్రతి రాష్ట్రం ప్రశంసిస్తోంది. 7 లక్షల టెస్టులు పూర్తికాగా, ప్రతి కుటుంబానికి పరీక్షలు జరిపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30 వేల బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 2 నెలల్లో మరో 40 వేల పడకలు సిద్ధమవుతాయి.” అని పేర్కొన్నారు.
కోవిడ్ నియంత్రణ, చికిత్సలో సిఎం జగన్ గారి కార్యదీక్ష, ముందు చూపును ప్రతి రాష్ట్రం ప్రశంసిస్తోంది. 7 లక్షల టెస్టులు పూర్తికాగా, ప్రతి కుటుంబానికి పరీక్షలు జరిపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30 వేల బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 2 నెలల్లో మరో 40 వేల పడకలు సిద్ధమవుతాయి.
— Vijayasai reddy v (@VSReddy_MP) June 26, 2020