ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగంపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. తాజాగా దీనిపై పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన పర్యాటక రంగంపై మాట్లాడారు. రాష్ట్రంలో 10 జిల్లాల్లో 10 స్టార్ హోటళ్లు నిర్మించనున్నట్లు ఆయన వివరించారు. తిరుమల శ్రీవారిని మంత్రి అవంతి దర్శించుకున్నారు.

 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక కరోనా గురించి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి యావత్తు ప్రపంచానికి విముక్తి కలగాలని కోరినట్లు ఆయన వివరించారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని కష్టాలు నుంచి గట్టెకించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా త్వరలోనే నూతన టూరిజం పాలసీని తీసుకొస్తున్నట్లు ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: