ఆంధ్రప్రదేశ్ సర్కార్ వరుసగా గత ప్రభుత్వ బకాయిలను విడుదల చేస్తుంది. తాజాగా 2019,20 కి సంబంధించిన పంట బకాయిలను విడుదల చేసింది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 5 లక్షల 94 వేల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. మొత్తం 596 కోట్లను ఏపీ సర్కార్ విడుదల చేసింది. 

 

ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్ రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులకు మద్దతు ధర వచ్చే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు అందరికి కూడా అండగా ఉంటామని అన్ని వసతులు కల్పిస్తామని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదు చేస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: