ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ప్రతీ రోజు కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు. అయితే కరోనా కట్టడి విషయంలో ఏపీ సర్కార్ విఫలం అయింది అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. కరోనాకేసులు పదివేలు దాటాయి కొవిడ్ నిబంధనలను ప్రతిపక్షాలపై కేసులుపెట్టి రాజకీయకక్ష తీర్చుకోవడానికి, గిట్టుబాటుధర లేని రైతులనిరసన అడ్డుకోవడానికి అమరావతి దీక్షలు విఫలంచేయడానికి వినియోగిస్తున్నారే కానీ ప్రజలను కరోనానునుండి రక్షించడానికి ఏం జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పండి వైఎస్ జగన్ గారూ అంటూ సిఎం జగన్ ని ట్యాగ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: