ఆంధ్రప్రదేశ్ లో అపోలో టైర్ తన తొలి టైర్ ని విడుదల చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు ఉదయం దానిని విడుదల చేయగా దీనిపై టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఘనత అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ట్వీట్ చేసారు.

 

ఏపీ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలన్న తపనతో, రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తెచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తోంది. చిత్తూరు జిల్లా, చిన్నపండూరులో 2018లో ఏర్పాటు చేసిన అపోలో టైర్  ఈరోజు నుండి ఉత్పత్తి ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాగా ప్రపంచంలో ఇది 7 వ అపోలో టైర్స్ ఉత్పత్తి కేంద్రం.



మరింత సమాచారం తెలుసుకోండి: